అశ్వమేధయాగమట!
అదేం పోయేకాలమో గానీ! యాగాలూ, యజ్ఞాలూ వర్షాలు కురిపిస్తాయనే నమ్మేవారు ఇప్పుడూ తగలడ్డారు. తెలియని రోజుల్లో నెయ్యి, ఇతర భక్ష్యాలూ అగ్నిలో వేసి అగ్నిని తృప్తి పరిస్తే శుభం కలుగుతుందనుకునేవారు. ఇప్పుడూ అదే తంతా!
అప్పుడు ఒక మేలుజాతి శ్వేతాశ్వాన్ని ఊర్లమీదికి వదిలి అది తిరిగినంత మేరా నా రాజ్యం అని ప్రకటించుకోవడానికి వీలయ్యేది. మరిప్పుడు ఆ గుర్రం పాకిస్తాను వైపు వెళితే అక్కడి సైనికులు దాన్ని ఆపేస్తారా? కాల్చి చంపేస్తారా? ఈ యాగం చేసే ప్రభుద్దులు యాగ ధర్మం ప్రకారం వారిపై యుద్దం చేస్తారా?
సరే ఎలాగోలా ఆ గుర్రం మన ప్రాంతాలలోనే తిరిగి వచ్చిందనుకుందాం. యాగానికి ముందురాత్రి ఆ గుర్రంతో గడపాల్సిన వనిత ఎవ్వరు? సరే ఎవ్వరో ఒకరు గడిపారే అనుకుందాం… ఆ మరుసటి రోజు యాగంలో ఆ గుర్రపు ఒక్కో అవయవమే వేద మంత్రాల సాక్షిగా అగ్నికి ఆహుతి చేస్తారా? ఇది క్షుద్రదేవతలకు, గ్రామ దేవతలకు బలి ఇవ్వడం కన్నా హేయం కాదా? బలి చట్ట వ్యతిరేకమయితే యాగం కాదా? ఒకవేళ ఇవన్నీ జరగలేదనుకుంటే ఇక యాగమెందుకు?
ఎటు వెళుతున్నాం మనం? మళ్ళీ వేద కాలానికా?
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: March 21, 2007 సమయము: 3:23 pm
మిగతా విషయాల మాటేమోగానీ యాగాలు వర్షాలు కురిపిస్తాయని నేను నమ్ముతాను.ఎందుకంటే యాజ్ఞం లో వేసే ఆవునెయ్యి,వివిధరకాల హోమ ద్రవ్యాలనుంది వెలువడే పొగవల్ల మేఘాలు ఏర్పడతాయట.దేశం అంతా కాదుగానీ ఆ యాగం చేసిన చోట వర్షాలు కురుస్తాయట.[నాకు ఏమి చెప్పాలో ఇడియా వుంది కానీ ఎలా చెప్పాలో తెలీయట్లేదండి.వెలువడే వాటి పేర్లు అది నాకు గుర్తులేవు]గాలిలో విషవాయువులు కలిసినప్పుడు కూడా ఇలా హోమం లో వెసే ద్రవ్యాలను మండిస్తే ఆ గాలి వ్యాపించిన మేరా విష ప్రభావం వుండదట.
తేది: March 21, 2007 సమయము: 3:30 pm
రాధిక గారు,
నెయ్యి మండిస్తే ఏమి వస్తుందో చెప్పలేరా ఇప్పుడు? మేఘాలు ఎలా ఏర్పడతాయో తెలిసిందే కదా, నీటి ఆవిరితో గానీ పొగతో కాదు కదా!
పైగా యాగాలలో వేసేది నెయ్యి మాత్రమే కాదండీ జంతువులను కూడా..ఒకానొకప్పుడు మనుషులను కూడా!
జంతు బలి ఇస్తే గ్రామ దేవత కోరికలు తీర్చి మనలని రక్షిస్తుంది అన్న నమ్మకం కంటే ఇది ఏవిధంగానూ భిన్నం కాదు.
–ప్రసాద్
తేది: March 21, 2007 సమయము: 4:01 pm
జంతువులను వేస్తారని నాకు తెలీదండి.కొన్ని పదార్దాలను మండించడం ద్వారా విడగొట్టినప్పుడు నీటి అణువులు కూడా ఏర్పడతాయి కదా.డిగ్రీ లో వున్నప్పుడు మా కెమిస్ట్రీ సార్ వీటిని డయాగ్రమాటిక్ గా చుపించారు.పురాణాల లో చెప్పబడిన సైన్స్ అంటూ ఇంకా చాలా విషయాలు చెప్పారు.నేను కెమిస్ట్రీ లో బాగా పూర్ కాబట్టి నాకు అవి అర్దం కాలేదు.అందుకే ఇప్పుడు సొదాహరణగా చెప్పలేక పోతున్నాను.
తేది: March 22, 2007 సమయము: 2:14 am
అయినా ఎంత నెయ్యి వేస్తే ఏ మాత్రం వర్షం పడుతుంది.హోమంలో నుండి వచ్చే పొగకి వర్షం వస్తుంది కాబట్టి ఇలాంటి యాగాలు చెయ్యాలి అన్నది పెద్ద లాజికల్ గా నాకు అనిపించట్లేదు.అసలు మన పురాణాలలో చెప్పే యాగాలన్నీ ఇలానే ఉంటాయి.మొన్న టీవీ లో భాగవతంలో చూపించాడు.పాండు రాజు నరకంలో ఉన్నాడని,ఆయనను పుణ్య లోకాలకు పంపాలని రాజసూయ యాగం చెయ్యమని నారదుడు పాండవులకు చెప్తాడు.రాజసూయ యాగం అంటే దాన ధర్మాలు ఇవ్వడం లాంటిది కాదు.సాధ్యమైనన్ని దేశాల రాజులతో పోరాడి వాళ్ళ పై విజయం సాధించడం.యుద్ధ అంటే ఎంత మంది చనిపోతారు?ఎంత నష్టం? అసలు వేరె వాళ్ళ రాజ్యాలు లోబర్చుకుంటే పుణ్యం ఎలా వస్తుందో,ఆ పాండు రాజు గారు పుణ్య లోకాలకు ఎలా పోతారో నాకే మాత్రం అర్ధం కాలేదు.
తేది: April 22, 2007 సమయము: 7:03 am
వేదాలలొ ఆవు గురించి దాని ప్రాషస్తము గురించి ఈ రోజే ఈటివి లో చూసాను. దాని పేడ మూత్రము నుంచి మందులు తయారుచేసి ఫ్యాక్టరీ పెట్టారు. వేపచెట్టు,రావిచేట్టు ఇలా ఎన్నో వాటి గొప్పదనాల్ని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరించారు.ఈచెత్లచుట్టూ తిరిగితే వ్యాదులు ఎలా నయమవుతాయొ శాస్త్రోక్తంగా శాస్త్రగ్నులు అంగీకరించారు. మనకు తెలిసిన కొద్ది జ్నానంతో వేదాలను అవహేలనచేయడము సబబుకాదు
తేది: April 23, 2007 సమయము: 9:06 am
అన్నయ్య,
వేదాలలో అన్ని విశయాలనూ అవహేళన చేయడం అర్థరహితమే! అయినా వాటి గురించి లోతుగా తెలియకుండా అవహేళన చేయడం ఎంత అర్థరహితమో, సమర్థించడమూ అంతే అర్థ రహితం. ఇంకా అనర్థదాయకం కూడా!
ఆవుపేడ, మూత్రం పవిత్రత గురించి చెప్పిన వేదాలే ఆవుమాంసం శ్రేష్టత గురించీ చెప్పాయి మరి మనమింకా దాని విశిష్టత తెలుసుకోలేదు.
పరిశీలన ద్వారా తెలుసుకున్నవే ఏ వేదాంశాలైనా అందులో కొన్ని శాస్త్ర పరీక్షలకు నిలబడొచ్చు కొన్ని తేలిపోవచ్చు. ఇందులో గొప్పదనమేదీ లేదు.
–ప్రసాద్
http://blog.charasala.com